News March 7, 2025

పరువు హత్య కేసులో సంచలన విషయాలు

image

AP: అనంతపురం(D)లో కలకలం రేపిన <<15657872>>పరువు హత్య<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘వేరే కులం వ్యక్తితో ప్రేమ వద్దని తండ్రి చెప్పినా కూతురు వినలేదు. చావడానికైనా సిద్ధమేనని చెప్పింది. దీంతో ఉరివేసుకోవాలని తండ్రి గద్దించగా కూతురు అలాగే చేసింది. తర్వాత పెద్ద అల్లుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దించాడు. సర్టిఫికెట్లు, పుస్తకాలను బాడీపై ఉంచి పెట్రోల్‌తో కాల్చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

Similar News

News November 26, 2025

బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

image

UP మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్‌లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.

News November 26, 2025

ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్‌లోనే శతకం చేశారు.

News November 26, 2025

చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

image

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.