News April 24, 2024
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి రిక్రూట్మెంట్ చెల్లదని పేర్కొంది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్ సీ, డీలో చేసిన నియామకాలన్నీ చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో నియమితులైన 23వేల మందికి పైగా ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ తీర్పు చెప్పింది. వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో మొత్తం జీతాన్ని తిరిగివ్వాలని తెలిపింది.
Similar News
News January 22, 2025
తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
News January 22, 2025
మహా కుంభమేళాకు వెళ్తున్నారా?
‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్లైన్లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.
News January 22, 2025
కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.