News June 12, 2024
నిర్మల 2.0లో సెన్సెక్స్ టార్గెట్ లక్ష!

కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.
Similar News
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.
News March 25, 2025
నాకోసం యువీ ఎండలో నిలబడేవారు: KKR డేంజరస్ బ్యాటర్

తన బ్యాటింగ్ స్కిల్ మెరుగవ్వడంలో ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ పాత్ర ఉందని KKR యువ బ్యాటర్ రమణ్దీప్ సింగ్ అన్నారు. ఆయనలా బ్యాటింగ్ చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ‘యువీ కొన్నిసార్లు తన ప్రాక్టీస్ వదిలి నేను ప్రాక్టీస్ చేసే PCA స్టేడియం వచ్చేవారు. కొన్నిసార్లు అంపైర్ ప్లేస్లో ఎండలో నిలబడి గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేసేవారు. వాటిని ఇంటికెళ్లి విశ్లేషించి నాకు సలహాలు ఇచ్చేవారు’ అని తెలిపారు.