News November 14, 2024

పోసానిపై వరుస ఫిర్యాదులు, శ్రీరెడ్డిపై కేసు

image

AP: YCP మద్దతుదారు పోసాని కృష్ణమురళిపై కూటమి నాయకులతో పాటు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన TDP అగ్రనేతలతో పాటు మద్దతుదారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సత్తెనపల్లి, ఫిరంగిపురం, బాపట్ల, సూళ్లూరుపేట, యర్రగొండపాలెం స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు, నటి శ్రీరెడ్డిపై విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైంది.

Similar News

News March 15, 2026

నిజామాబాద్: బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు వారికి దిశా నిర్దేశం చేశారు.

News March 15, 2026

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.

News March 15, 2026

అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

image

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.