News August 6, 2024
లంకతో సిరీస్.. రోహిత్, కోహ్లీ అవసరం లేదు: నెహ్రా

శ్రీలంకతో వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని మాజీ బౌలర్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డారు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. ‘కోహ్లీ, రోహిత్ గురించి గంభీర్కు తెలియనిదేముంది? అతనేం విదేశీ కోచ్ కాదు కదా? స్వదేశంలో జరిగే సిరీస్లలో వాళ్లిద్దరినీ ఆడించొచ్చు. గంభీర్ అనుసరిస్తున్న విధానం తప్పని అనడం లేదు. కానీ సిరీస్లో ఈ వ్యూహం పాటిస్తే బాగుండేది’ అని అన్నారు.
Similar News
News December 15, 2025
దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News December 15, 2025
300 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.250. వెబ్సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 15, 2025
జాబ్ చేసుకుంటూ బీటెక్!

వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు AICTE పర్మిషన్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా, బీటెక్, ఎంటెక్, MBA వంటి కోర్సులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అమలు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఆఫీసు వేళల తర్వాత లేదా వీకెండ్స్లో క్లాసులకు హాజరుకావచ్చు. ఇప్పటికే ఈ విధానం కొన్నిచోట్ల అమల్లో ఉండగా, ఇకపై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.


