News August 3, 2024

SGB స్కీమ్: కేంద్రం షాకివ్వనుందా?

image

సావరిన్ గోల్డ్ బాండ్స్. చాలామందికి ఇష్టమైన స్కీమ్. ఏటా 2.5% వడ్డీ, మెచ్యూరిటీ తీరాక గోల్డ్‌కు సమాన రాబడి, LTCG వర్తించకపోవడం దీని బెనిఫిట్స్. అయితే ప్రభుత్వం దీన్ని నిలిపేయొచ్చని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఫిజికల్ గోల్డుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ పూడ్చుకొనేందుకు SGBపై పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉందట. పైగా ఇది సోషల్ సెక్టార్ స్కీమ్ కాదు. కొన్నిరోజుల్లో స్పష్టత రావొచ్చు.

Similar News

News March 3, 2026

తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT

News March 3, 2026

క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

image

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్‌ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.

News March 3, 2026

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

image

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.