News January 7, 2025

షేర్లు విలవిల.. బిట్‌కాయిన్ కళకళ

image

గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్న వేళ క్రిప్టో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.43% పెరిగి $3.58Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ నిన్న $3,871 (Rs3.30L) పెరిగి $1,02,235ను తాకింది. నేడు $1,01,872 వద్ద ట్రేడవుతోంది. Mcap 2.74% ఎగిసి $2.01Tకి చేరుకుంది. ఎథీరియం $3,700 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. 1.42% లాభంతో $3,687 వద్ద ముగిసింది. ప్రస్తుతం $3,665 వద్ద కొనసాగుతోంది.

Similar News

News January 17, 2025

‘వీరమల్లు’ లాంటి కథలు అరుదుగా వస్తాయి: బాబీ డియోల్

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని బాబీ డియోల్ తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

News January 17, 2025

ఫొటోలతో అనుబంధాన్ని వ్యక్తపరిచారు!

image

సంసార జీవితం పదికాలాల పాటు సాగాలంటే ఆ జంట మధ్య అన్యోన్యత పరిఢవిల్లాలి అని చెబుతుంటారు. అయితే, ఆ అన్యోన్యత ఎలా చూపించాలనే దానికి ఓ జంట కొత్త అర్థాన్ని చూపింది. 12 ఏళ్ల క్రితం కలిసిన ఈ జంట ఏటా ఓ ఫొటో దిగుతూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూపుతూ వచ్చింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించగా ఆమెతోనూ ఫొటోకు పోజులిస్తూ వచ్చారు. ఇలా ఒక్క మాట మాట్లాడకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తపరిచారు.

News January 17, 2025

ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

image

AP: పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.