News May 26, 2024

షర్మిల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు: చింతా మోహన్

image

AP పీసీసీ చీఫ్ షర్మిల ఎవరితో చర్చించకుండా ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తాము ఆశించామని.. షర్మిల వ్యూహం తప్పయిందని అభిప్రాయపడ్డారు. టికెట్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఇవ్వలేదో తెలియదన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ కాంగ్రెస్ అని నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ 2 ల్యాబ్ ట్రైనీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 18న ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎంపికైనవారికి నెలకు జీతం రూ.18,000-రూ.22,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/