News October 29, 2024

విజయమ్మ లేఖపై స్పందించిన షర్మిల

image

విజయమ్మ రాసిన లేఖపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ‘రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన’ అంటూ తల్లి లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News January 11, 2026

పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ

image

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన <<18824096>>పంత్<<>> న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. అయితే రెగ్యులర్ కీపర్‌గా రాహుల్ ఉన్న నేపథ్యంలో రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన జురెల్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కాగా ఇవాళ 1.30pmకు వడోదరాలో తొలి వన్డే ప్రారంభం కానుంది.

News January 11, 2026

పంచె కట్టు నచ్చట్లేదు.. భర్తకు విడాకులిచ్చేస్తా!

image

భోపాల్‌లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. భర్త పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను SI చేశారు. తీరా ఆమె పోలీస్ ఉద్యోగం సంపాదించాక ఇప్పుడు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. భర్త ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తనకు నచ్చడం లేదని అది తన హోదాకు అవమానంగా ఉందని వాదిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.

News January 11, 2026

ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

image

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.