News November 28, 2024
EVMలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

EVMలు ట్యాంపరింగ్ అవుతున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంటే, ఆ పార్టీ MP శశిథరూర్ అందుకు భిన్నంగా స్పందించారు. EVMల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందని చెప్పారు. అనధికార EVMలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్లు భావిస్తే, నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకూ అవకాశం ఉందన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్లే అసలు సమస్య అని చెప్పారు.
Similar News
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


