News November 28, 2024
EVMలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

EVMలు ట్యాంపరింగ్ అవుతున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంటే, ఆ పార్టీ MP శశిథరూర్ అందుకు భిన్నంగా స్పందించారు. EVMల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందని చెప్పారు. అనధికార EVMలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్లు భావిస్తే, నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకూ అవకాశం ఉందన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్లే అసలు సమస్య అని చెప్పారు.
Similar News
News April 13, 2026
సంగారెడ్డి: బీటెక్ విద్యార్థి మృతి.. ఐదుగురికి పునర్జన్మ

తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశారు సంగారెడ్డి మం. కోత్లాపూర్కు చెందిన ఉదయ్ కిరణ్ (21). బీటెక్ పూర్తి చేసిన ఉదయ్ ఈనెల 4న బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆ పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో ఉదయ్ అవయవాలు సేకరించి ఐదుగురు బాధితులకు అమర్చి పునర్జన్మ ప్రసాదించారు.
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News April 13, 2026
ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.


