News December 31, 2024
రైతులకు షాక్.. DAP ధర పెంపు

దేశంలో DAP(డై అమ్మోనియం ఫాస్పేట్) ధర రేపటి నుంచి 50KGల బస్తాపై కనీసం ₹200 పెరగనుంది. DAP దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు నేటితో ముగియనుంది. దీని పొడిగింపుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పెరగడంతో DAP ధర పెరగక తప్పదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూరియా తర్వాత రైతులు అత్యధికంగా DAP వినియోగిస్తారు. ప్రస్తుతం 50KGల బ్యాగ్ ధర ₹1350 ఉంది.
Similar News
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


