News December 31, 2024
రైతులకు షాక్.. DAP ధర పెంపు
దేశంలో DAP(డై అమ్మోనియం ఫాస్పేట్) ధర రేపటి నుంచి 50KGల బస్తాపై కనీసం ₹200 పెరగనుంది. DAP దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు నేటితో ముగియనుంది. దీని పొడిగింపుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పెరగడంతో DAP ధర పెరగక తప్పదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూరియా తర్వాత రైతులు అత్యధికంగా DAP వినియోగిస్తారు. ప్రస్తుతం 50KGల బ్యాగ్ ధర ₹1350 ఉంది.
Similar News
News January 23, 2025
పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!
దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.
News January 23, 2025
జైలు శిక్షపై స్పందించిన RGV
చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.
News January 23, 2025
వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ
AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.