News February 3, 2025
SHOCKING: సీఎం చంద్రబాబు భూమి స్వాహాకు యత్నం!
AP: భూమాఫియా బరితెగించింది. ఏకంగా CM చంద్రబాబు స్థలంపైనే కన్నువేసింది. 25 ఏళ్ల కిందట బాపట్లలో TDP ఆఫీస్ కోసం ఓ వ్యక్తి CBN పేరిట 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించారు. కాలక్రమంలో దీని విలువ రూ.1.50 కోట్లకు చేరడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా మోసం బయటపడింది. బాపట్ల MLA ఫిర్యాదుతో సత్తార్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News February 3, 2025
ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?
TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.
News February 3, 2025
TTD UPDATE: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లు
రేపు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అష్టాదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అటు ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను, నేటి నుంచి 3రోజుల వరకూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.
News February 3, 2025
ముద్రగడకు YS జగన్ పరామర్శ
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. నిన్న ఆయన నివాసంపై <<15338401>>దాడి<<>> జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ యువకుడు ముద్రగడ ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టిన సంగతి తెలిసిందే.