News January 5, 2025
SHOCKING: పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్

హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం పెళ్లి కాని జంటలు రూమ్ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత UP మీరట్లో అమలుచేస్తోంది. ఆ తర్వాత దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే IDని సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు.
Similar News
News November 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 22, 2025
AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీ టెట్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్సైట్: https://tet2dsc.apcfss.in/
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.


