News February 2, 2025

SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

image

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Similar News

News January 31, 2026

నేడు శని త్రయోదశి.. సాయంత్రం ఇలా చేయండి!

image

శనైశ్చరుడు విష్ణు భక్తుడు కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితుల మాట. ‘సా.5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోండి’ అని చెబుతున్నారు.

News January 31, 2026

కోళ్లలో ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు

image

కోళ్ల పెంపకంలో అతి ప్రధాన సమస్య వ్యాధులు రావడం. వీటిని సకాలంలో గుర్తించి, నివారించకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోళ్లలో అతి ప్రమాదకరమైనది కొక్కెర వ్యాధి. దీంతోపాటు కొరైజా, అమ్మోరు/మశూచి, పుల్లొరం, తెల్లపారుడు వ్యాధులు పెంపకందారులకు, ఫౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని కోళ్లలో ఎలా గుర్తించాలి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 31, 2026

రాజధానిలోని ఆ మైనర్లకు పెన్షన్లు!

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.5వేలు పెన్షన్ అందిస్తోంది. ఏదైనా కారణంతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన పిల్లల్లో మైనర్లు ఉంటే వారికీ ఆర్థిక సాయం చేయాలని ఇటీవల క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇలా మైనర్లకు పెన్షన్లు అందజేయడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా పిల్లలకు పెన్షన్లు అందించే అధికారాన్ని CRDAకు అప్పగించింది.