News February 2, 2025

SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

image

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Similar News

News November 27, 2025

డిసెంబర్‌లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

image

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్‌లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.

News November 27, 2025

తీవ్ర అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 50-70KM వేగంతో గాలులు వీస్తాయంది.

News November 27, 2025

నేడే మెగా వేలం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.