News September 28, 2024
ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా.. ఇది కూడా పరిశీలించండి

అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ ప్రైస్ వార్కు తెరలేపాయి. ఈ-కామర్స్లకు ధీటుగా షావోమీ, శాంసంగ్ లాంటి సంస్థలు తమ సొంత ఆన్లైన్ స్టోర్స్లో కూడా సేల్స్ ప్రారంభించాయి. ఈ-కామర్స్ కంటే అధిక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఏ బ్యాంక్ కార్డుపై అయినా ధరల తగ్గింపు ఇస్తున్నాయి. కాబట్టి షాపింగ్ చేసే ముందు ఈ-కామర్స్, ప్రొడక్ట్ సంస్థ పోర్టల్లో ధరలు చెక్ చేసుకోండి. SHARE IT.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


