News April 15, 2025
మరో 15 రన్స్ చేసి ఉండాల్సింది: రిషభ్ పంత్

తాము ఇంకో 15 పరుగులు చేసి ఉండాల్సిందని LSG కెప్టెన్ రిషభ్ పంత్ అన్నారు. రన్రేట్ పెరుగుతున్న క్రమంలో ప్రతిసారీ వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోర్ చేయలేకపోయామని CSKతో ఓటమి తర్వాత తెలిపారు. మరోవైపు తాను బ్యాటింగ్లో నెమ్మదిగా లయ అందుకున్నట్లు చెప్పారు. పవర్ ప్లేలో బౌలింగ్ వేసే అంశంపై తాము దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రతి మ్యాచ్ నుంచి సానుకూల అంశాలు తీసుకొని ముందుకు సాగుతామని పంత్ వివరించారు.
Similar News
News November 15, 2025
బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 15, 2025
ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<


