News April 15, 2025
మరో 15 రన్స్ చేసి ఉండాల్సింది: రిషభ్ పంత్

తాము ఇంకో 15 పరుగులు చేసి ఉండాల్సిందని LSG కెప్టెన్ రిషభ్ పంత్ అన్నారు. రన్రేట్ పెరుగుతున్న క్రమంలో ప్రతిసారీ వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోర్ చేయలేకపోయామని CSKతో ఓటమి తర్వాత తెలిపారు. మరోవైపు తాను బ్యాటింగ్లో నెమ్మదిగా లయ అందుకున్నట్లు చెప్పారు. పవర్ ప్లేలో బౌలింగ్ వేసే అంశంపై తాము దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రతి మ్యాచ్ నుంచి సానుకూల అంశాలు తీసుకొని ముందుకు సాగుతామని పంత్ వివరించారు.
Similar News
News September 13, 2025
ఆసియాకప్: ఫైనల్లో భారత మహిళా జట్టు

హాకీ ఆసియా కప్లో భారత మహిళా జట్టు ఫైనల్ చేరింది. జపాన్తో జరిగిన సూపర్ స్టేజి-4 మ్యాచ్లో 1-1 గోల్స్తో మ్యాచ్ డ్రాగా ముగియగా, అటు కొరియాపై చైనా 1-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఆధారంగా ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఫైనల్ చేరింది. రేపు చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే WCనకు అర్హత సాధించనుంది. ఇటీవల జరిగిన పురుషుల హాకీ ఆసియాకప్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News September 13, 2025
ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.