News February 24, 2025

జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదా?

image

AP: మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్‌లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.

Similar News

News January 21, 2026

100 ఏళ్లుగా హిందుత్వంపై డీఎంకే దాడి: మద్రాస్ HC తీవ్ర వ్యాఖ్యలు

image

సనాతన ధర్మంపై తమిళనాడు Dy.CM ఉదయనిధి <<14423722>>స్టాలిన్ చేసిన కామెంట్స్<<>> విద్వేష ప్రసంగం కిందికే వస్తాయని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘100 ఏళ్లుగా హిందూ మతంపై DMK(గతంలో DK) దాడి చేస్తోంది. ఈ మంత్రి అదే సైద్ధాంతిక వంశానికి చెందిన వారు’ అని ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలు చేసే వారికి శిక్షలు పడటంలేదని చెప్పింది. మంత్రి చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని గుర్తుచేసింది.

News January 21, 2026

వంటింటి చిట్కాలు మీకోసం

image

☛ బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
☛ సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలు లేదా శనగ పిండిలో కొద్దిగా నీరు కలిపి దాంట్లో యాడ్ చేయాలి.
☛ పాత్రల్లో నీచు వాసన పోవాలంటే వాటిలో ఉప్పు వేసి కాసేపటి తర్వాత కడిగితే సరిపోతుంది.
☛ పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వెయ్యాలి.

News January 21, 2026

ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. 10gలపై రూ.73వేలు లాభం!

image

ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలొచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ.81,230 ఉన్న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు రూ.1,54,800కు చేరి రూ.73,570 లాభాన్ని పంచింది. అలాగే ఈ 3 రోజుల్లోనే రూ.11,020 పెరిగింది. అటు KG వెండి ధర రూ.1,04,000 నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,40,000కు చేరుకుంది. ఈ భారీ లాభాలతో పసిడి, వెండిపై ఇన్వెస్టర్లకు మరింత నమ్మకం ఏర్పడింది.