News November 26, 2024

అసెంబ్లీ గడువు ముగిస్తే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా..

image

అలాంటి నిబంధనేమీ లేదు. రాజకీయ అనిశ్చితిని బట్టి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపిస్తారు. స్థిరత్వం ఉంటే ఆపద్ధర్మ CMను నియమిస్తారు. లేదంటే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతారు. <<14711279>>మహారాష్ట్ర<<>>లో 4 సందర్భాల్లో అసెంబ్లీ గడువు ముగిశాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. 2004, 2009, 2014, 2019లో అసెంబ్లీ గడువులు ముగిసినా 7-30 రోజులు వ్యవధి తర్వాత కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారీ అలాగే జరగొచ్చు.

Similar News

News January 5, 2026

రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News January 5, 2026

హసీనానూ పంపించేయండి.. ఒవైసీ సంచలన కామెంట్స్!

image

బంగ్లాదేశ్ క్రికెటర్‌ను తిప్పి పంపుతున్నప్పుడు భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ PM షేక్ హసీనాను ఎందుకు పంపడం లేదని MP అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను IPL 2026 నుంచి రిలీజ్ చేయాలని BCCI తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రికెట్ ఆడినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు.

News January 5, 2026

నష్టాల్లో మార్కెట్స్.. IT సెక్టార్ డౌన్

image

భారత సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోయి 85,570 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 26,300 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2% వరకు నష్టాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి దిగ్గజ ఐటీ సంస్థల స్టాక్స్ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.