News November 26, 2024
అసెంబ్లీ గడువు ముగిస్తే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా..

అలాంటి నిబంధనేమీ లేదు. రాజకీయ అనిశ్చితిని బట్టి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపిస్తారు. స్థిరత్వం ఉంటే ఆపద్ధర్మ CMను నియమిస్తారు. లేదంటే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతారు. <<14711279>>మహారాష్ట్ర<<>>లో 4 సందర్భాల్లో అసెంబ్లీ గడువు ముగిశాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. 2004, 2009, 2014, 2019లో అసెంబ్లీ గడువులు ముగిసినా 7-30 రోజులు వ్యవధి తర్వాత కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారీ అలాగే జరగొచ్చు.
Similar News
News December 31, 2025
జనవరి 31వరకు వార్షిక రిటర్నుల ఫైలింగ్కు ఛాన్స్

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక రిటర్నులు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైలింగ్కు గడువును కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొడిగించింది. నిన్నటితో ముగియాల్సిన గడువును జనవరి 31వరకు పెంచుతూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అవకాశం కల్పించింది. ఫైలింగ్లో సమస్యలు, ఇతర విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
News December 31, 2025
మీ నూతన సంవత్సరం శుభప్రదంగా ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నారా?

వేద ఆశీర్వచనంతో కూడిన ఆయుష్య హోమం ద్వారా పాత దోషాలు తొలగి, దేవతల అనుగ్రహంతో నూతన సంవత్సరం శుభప్రదంగా మొదలవుతుంది. ఈ సంవత్సరం వ్యాపారం, వృత్తి, జీవన ప్రయాణంలో ఐశ్వర్యం, విజయం, స్థిరత్వం పొందే అనుగ్రహాన్ని కూడా పొందండి. మీ పేరు & గోత్రంతో వేదమందిర్లో ఇప్పుడే <
News December 31, 2025
8th Pay Commission: జీతం పెంపు ఎంత ఉండొచ్చంటే..?

8వ వేతన సంఘం <<18638670>>రేపటి<<>> నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ప్రకటించగా.. కనీస మూల వేతనం ₹7,440 నుంచి ₹18 వేలకు పెరిగింది. ఇప్పుడు ఒకవేళ ఫిట్మెంట్ 2.15గా ప్రకటిస్తే ₹18 వేల బేసిక్ శాలరీ ఉన్న వారికి ₹38,700కు పెరగవచ్చు.


