News November 15, 2024
శ్రద్ధా వాకర్ హత్య: అఫ్తాబ్కు బిష్ణోయ్ గ్యాంగ్ ‘స్కెచ్’

రెండేళ్ల క్రితం దేశంలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో పట్టుబడ్డ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శివకుమార్ ఈ విషయం చెప్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పూనావాలాకు భద్రత పెంచడంతో ఆ నిర్ణయాన్ని గ్యాంగ్ విరమించుకున్నట్లు చెప్పారు. శ్రద్ధను పూనావాలా చంపి 35 ముక్కలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.
News March 9, 2026
అలాంటి వీడియోలు ఫోన్లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది.


