News March 17, 2024
KKR క్యాంపులో చేరిన శ్రేయస్ అయ్యర్

కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుతో చేరారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో అయ్యర్ అడుగు పెట్టారు. కాగా అయ్యర్ ఇటీవల వెన్నునొప్పి గాయంతో సతమతమవుతున్నారు. ఇంగ్లండ్తో సిరీస్ మధ్యలో గాయంతో వైదొలిగారు. అనంతరం ముంబై తరఫున రంజీల్లో ఆడారు. మళ్లీ వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం అతడు IPLలో ఆడేది కూడా అనుమానమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 22, 2026
విశాఖలో టీ20.. రేపట్నుంచి ఆన్లైన్లో టిక్కెట్లు

AP: విశాఖలో జనవరి 28న భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను రేపట్నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నారు. సా.5 గంటల నుంచి ‘డిస్ట్రిక్ట్’ యాప్లో టికెట్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. 5 టీ20ల సిరీస్లో నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి 1-0తో లీడ్లోకి వెళ్లింది.
News January 22, 2026
మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.
News January 22, 2026
బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

ఈ సీజన్లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.


