News February 12, 2025

సిక్కుల ఊచకోత: కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు

image

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.

Similar News

News January 21, 2026

కుమారస్వామిని ఆరాధిస్తే..

image

కుమారస్వామిని ఆరాధించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఆయనను కొలిస్తే శత్రుభయం, కోర్టు సమస్యల నుంచి విముక్తి లభించి విజయాలు వరిస్తాయి. సునిశిత బుద్ధికి ప్రతీక అయిన ఆయన ‘వేలు’ (శూలం) పిల్లలకు చదువు, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుజ దోష నివారణకు, సంతాన ప్రాప్తికి, ఆధ్యాత్మిక ఉన్నతికి షణ్ముఖుని పూజ ఉత్తమమైన మార్గం. సర్ప రూపంలో ఆయనను ఆరాధించడం కుండలిని శక్తిని జాగృతం చేసి యోగ సాధనకు తోడ్పడుతుంది.

News January 21, 2026

శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్

image

శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఛార్జిషీట్ వేయడంలో SIT విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారించాల్సి ఉన్నందున పొట్టికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇక రాజీవరు బెయిల్‌పై కోర్టు గురువారం తీర్పు చెప్పనుంది.

News January 21, 2026

భయపడొద్దు పార్టీ అండగా ఉంటుంది: జగన్

image

AP: ప్రభుత్వ దన్నుతో కూటమి నేతలు, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని దిగజారుస్తున్నారని YCP చీఫ్ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ కుమారులు, పార్టీనేతలు తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. కాగా ఎవరూ భయపడొద్దని, అక్రమ కేసులపై పార్టీ లీగల్ సెల్ న్యాయసహాయం అందిస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.