News February 12, 2025

సిక్కుల ఊచకోత: కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు

image

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.

Similar News

News November 23, 2025

రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

News November 23, 2025

CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

image

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.

News November 23, 2025

బంధువుల ఇంట్లో ఏ దిశన తలపెట్టి పడుకోవాలి?

image

బంధువుల ఇళ్లకు వెళ్తే తూర్పు దిశన తల, పడమర దిశకు కాళ్లు పెట్టి పడుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీని వలన సుఖ నిద్ర లభిస్తుందని అంటున్నారు. ఉదయం తేలికగా నిద్ర లేవవచ్చని తెలుపుతున్నారు. ‘ఇది తాత్కాలిక నివాసానికి, ఇతరులకు ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి మేల్కొనడానికి దోహదపడుతుంది. మంచి విశ్రాంతి కోసం ఈ దిశను వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>