News June 18, 2024
సిక్కోలు ప్రజల కల నిజమైంది: రామ్మోహన్ నాయుడు

AP: తాను కేంద్ర మంత్రి కావడంతో సిక్కోలు ప్రజల కల నిజమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడారు. కష్టనష్టాల్లో జిల్లా ప్రజలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి


