News June 18, 2024
సిక్కోలు ప్రజల కల నిజమైంది: రామ్మోహన్ నాయుడు

AP: తాను కేంద్ర మంత్రి కావడంతో సిక్కోలు ప్రజల కల నిజమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడారు. కష్టనష్టాల్లో జిల్లా ప్రజలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News January 14, 2026
అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్లాండ్!

డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును US కాంగ్రెస్లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశపెట్టారు. ‘గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్లాండ్ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని <<18784880>>ట్రంప్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
News January 14, 2026
సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.
News January 14, 2026
నేడు రెండో వన్డే.. సిరీస్పై టీమ్ ఇండియా గురి

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.


