News March 21, 2025
భారీగా తగ్గిన సిల్వర్ రేటు

బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.90,200కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.
Similar News
News April 25, 2025
IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.
News April 25, 2025
హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.
News April 25, 2025
ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.