News January 23, 2025
పవన్తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 11, 2025
మీకూ గాఢ నిద్రలో ఇలా జరుగుతోందా?

కొందరు రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైనవారు చేజారిపోతున్నట్లు, మరణిస్తున్నట్లు కల వస్తే ఏడుస్తారు. జీవితంలో మానసిక దెబ్బలు తిన్నవారు కూడా అసంకల్పితంగా నిద్రలో ఏడుస్తుంటారు. అణిచిపోయిన భావోద్వేగాలతోనూ నిద్రలో ఏడ్చే అవకాశం ఉంది. బైపోలార్ డిజార్డర్, స్లీప్ ఆప్నియా, ఇన్సోమ్నియా, మూడ్ స్వింగ్స్ ఉన్నవారూ ఇలాగే ప్రవర్తిస్తారు.
News February 11, 2025
BIG BREAKING: బీర్ల ధరలు పెంపు

తెలంగాణలో మందుబాబులకు షాక్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఏపీలో రూ.99 మద్యం, బీర్ల ధరలు తప్ప మిగతా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.
News February 11, 2025
APSRTC ఉద్యోగులకు తీపికబురు

APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ బకాయిలో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు రూ.60 కోట్ల మేర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.