News March 15, 2025
నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.
Similar News
News December 12, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,910 పెరిగి రూ.1,32,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,750 ఎగబాకి రూ.1,21,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.6,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 12, 2025
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News December 12, 2025
‘టెన్త్’ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ

TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ (MAR 14-APR 16) <<18526038>>వివాదంపై<<>> స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. CBSE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్కు ఎక్కువ రోజులు సెలవులిచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.


