News January 7, 2025
ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిరాజ్కు రెస్ట్!

ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు పేసర్ సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.
Similar News
News October 22, 2025
కార్తీక మాసంలో శివపూజ.. యముడు కూడా ఏం చేయలేడట

కార్తీక మాసంలో శివారాధన విశిష్టమైనది. ఆయనను పూజించే వారికి అపమృత్యు భయాలుండవని నమ్మకం. ఓనాడు శివుడి పరమ భక్తుడైన మార్కండేయుడిని సంహరించడానికి వెళ్లిన యముడిని, శివుడు సంహరించాడు. లోక కళ్యాణం కోసం తిరిగి బతికించి, తన భక్తుల విషయంలో అచిరకాల నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించాడు. ఆనాటి నుంచి శివభక్తులపై యమ పాశాన్ని ప్రయోగించడానికి యముడు వెనుకాడతాడని విశ్వసిస్తారు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేయాలంటారు.
News October 22, 2025
ఇలా చేస్తే మీ గుండె పదికాలాలు పదిలమే: వైద్యులు

వరుసగా 40 పుష్-అప్స్ చేయగలిగే వారికి గుండెపోటు ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయని ప్రముఖ డాక్టర్ సుధీర్ తెలిపారు. గుండె ఆరోగ్యం కోసం చేసే ఏరోబిక్ వ్యాయామాలతో పుష్-అప్స్కు సంబంధం ఉందని, ఇది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తుందని చెబుతున్నారు. 1,000 మంది పురుషులపై చేసిన JAMA నెట్వర్క్ అధ్యయనంలో 40కి పైగా పుష్-అప్స్ చేయలేనివారితో పోల్చితే చేసిన వారికి గుండెపోటు ప్రమాదం 96% తక్కువ అని తేలింది.
News October 22, 2025
7,565 పోస్టులు.. గడువు పొడిగింపు

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తు గడువును SSC ఈ నెల 31 వరకు పొడిగించింది. 18-25 ఏళ్ల వయస్కులు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్: https://ssc.gov.in/