News September 12, 2024
ఇందిరాగాంధీతో JNUకి రిజైన్ చేయించిన సీతారాం

సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. 1977లో JNU ఛాన్సలర్గా ఉన్న అప్పటి PM ఇందిరాగాంధీ ఆ పోస్టుకు రిజైన్ చేయాలన్న డిమాండ్ను ఆమె ఎదుటే నిల్చుని వినిపించారాయన. JNU విద్యార్థుల్ని సంఘటితం చేసి ప్రధాని నివాసానికి తీసుకెళ్లి ఆమెపై చేసిన తీర్మానాన్ని చదివారు. ఆ తర్వాత ఇందిర ఆ పదవికి రిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Similar News
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.
News January 23, 2026
రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News January 23, 2026
వసంత రుతువు రాకను సూచించే పండుగ

వసంత పంచమి అంటే వసంత కాలానికి స్వాగతం పలికే రోజు. మాఘ మాసంలో ఐదవ రోజున ఈ పండుగ వస్తుంది. ఇది చలికాలం ముగింపును, ప్రకృతిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. ఈ సమయంలో ఆవ చేలు పసుపు రంగు పూలతో కళకళలాడుతుంటాయి. పసుపు రంగు జ్ఞానానికి, శక్తికి, శాంతికి చిహ్నం. అందుకే కొత్త పనులు ప్రారంభించడానికి, పెళ్లిళ్లకు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భారతీయులు భావిస్తారు.


