News September 12, 2024
ఇందిరాగాంధీతో JNUకి రిజైన్ చేయించిన సీతారాం

సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. 1977లో JNU ఛాన్సలర్గా ఉన్న అప్పటి PM ఇందిరాగాంధీ ఆ పోస్టుకు రిజైన్ చేయాలన్న డిమాండ్ను ఆమె ఎదుటే నిల్చుని వినిపించారాయన. JNU విద్యార్థుల్ని సంఘటితం చేసి ప్రధాని నివాసానికి తీసుకెళ్లి ఆమెపై చేసిన తీర్మానాన్ని చదివారు. ఆ తర్వాత ఇందిర ఆ పదవికి రిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Similar News
News July 8, 2025
GREAT: 67 ప్రాణాలు కాపాడిన కుక్క..!

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. గత నెల 30న అర్ధరాత్రి మండి జిల్లా సియాథిలో ఓ కుక్క అరుపులు విని గ్రామస్థుడు నరేంద్ర నిద్ర లేచాడు. ఆ సమయంలో ఇంట్లోని గోడకు పగుళ్లు, నీరు లీక్ కావడం గమనించి గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశాడు. వారు వెంటనే గ్రామాన్ని విడిచారు. కాసేపట్లోనే కొండచరియలు విరిగిపడి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కుక్క అరుపు వల్ల 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి.
News July 8, 2025
క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.
News July 8, 2025
చలాన్లు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్లను అధికారులు సస్పెండ్ చేశారు.