News September 23, 2024
SKLM: స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి నియమాకం

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఉరిటి సాయికుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విధుల్లో చేరారు. గతంలో మన్యం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఈయన విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో శ్రీకాకుళం జిల్లా అధికారిగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ను కలుసుకున్నారు.
Similar News
News January 8, 2026
ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.
News January 8, 2026
SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్పర్సన్

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.
News January 8, 2026
SKLM: అంగన్వాడీలో చిన్నారులకు కొత్త మెనూ

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.


