News September 18, 2024
తక్కువసేపు నిద్ర పోతున్నారా?

ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
Similar News
News September 9, 2025
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల మరణించారు.
News September 9, 2025
ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు: TDP

AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.
News September 9, 2025
నేపాల్ రణరంగం.. దుబాయ్ పారిపోయేందుకు PM ప్లాన్

నేపాల్లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.