News March 23, 2024

మరింత స్మార్ట్‌గా కంప్యూటర్లు: Nvidia సీఈవో

image

మానవాభివృద్ధి కోసం AI టెక్నాలజీని ఉపయోగిస్తామని Nvidia సీఈవో జెన్సన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్లలో ఈ సంస్థ ఒకటి. ఓ ఇంటర్వ్యూలో జెన్సన్ మాట్లాడుతూ.. ‘మనుషులు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునేంత స్మార్ట్‌గా కంప్యూటర్లు ఉండాలి. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ అనేది ప్రత్యేకమైన స్కిల్ కాదు. యువత కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

image

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.

News January 20, 2026

ఫోన్‌పే IPOకు SEBI ఓకే

image

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి.

News January 20, 2026

వీధికుక్కల కేసు.. మేనకా గాంధీపై సుప్రీం ఫైర్

image

వీధికుక్కల అంశంపై తమ కామెంట్స్‌ను కించపరచడం కోర్టు ధిక్కరణేనని BJP నేత మేనకా గాంధీపై SC మండిపడింది. ‘మీరు మా వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. మీ క్లయింట్ ఎలాంటి కామెంట్స్ చేశారో అడిగారా? ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా?’ అని మేనకా తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తాను గతంలో కసబ్ తరఫునా వాదించానని ఆయన గుర్తుచేశారు. కానీ కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ తదుపరి విచారణను JAN 28కి వాయిదా వేసింది.