News March 23, 2024
మరింత స్మార్ట్గా కంప్యూటర్లు: Nvidia సీఈవో

మానవాభివృద్ధి కోసం AI టెక్నాలజీని ఉపయోగిస్తామని Nvidia సీఈవో జెన్సన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్లలో ఈ సంస్థ ఒకటి. ఓ ఇంటర్వ్యూలో జెన్సన్ మాట్లాడుతూ.. ‘మనుషులు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునేంత స్మార్ట్గా కంప్యూటర్లు ఉండాలి. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ అనేది ప్రత్యేకమైన స్కిల్ కాదు. యువత కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
విచారణకు రాని ఫిరాయింపు MLAల కేసు

ఫిరాయింపు MLAల కేసు SCలో ఈరోజు లిస్టయినా విచారణకు రాలేదు. లంచ్ బ్రేక్ తరువాత వస్తుందనుకున్నా ఇతర కేసులతో విచారణ జరగలేదు. SCకి క్రిస్మస్, శీతాకాలం సెలవులు జనవరి 4వరకు ఉంటాయి. ఆ తరువాత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం ఇచ్చిన గడువులో స్పీకర్ ఐదుగురు MLAలపై <<18592868>>నిర్ణయం<<>> తీసుకున్నారు. మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసు విచారణకు వచ్చేలోపు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
News December 19, 2025
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News December 19, 2025
నాబార్డ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

<


