News January 27, 2025
ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి

2024కు గాను ICC ఉమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత ప్లేయర్ స్మృతి మంధాన సొంతం చేసుకున్నారు. ఆమె రెండోసారి ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. గత ఏడాది స్మృతి 13 ఇన్నింగ్స్లలో 747 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ఇక ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అఫ్గాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా సాధించారు. ఈయన 14 మ్యాచ్లలో 417 రన్స్తో పాటు 17 వికెట్లను పడగొట్టారు.
Similar News
News February 9, 2025
చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

తన కొడుకు నాగచైతన్యను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 9, 2025
సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.
News February 9, 2025
గిల్ ఉంటే రో‘హిట్’

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.