News September 23, 2024

వేతన సవరణకు మరికొంత సమయం?

image

TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 16, 2026

బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

image

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.

News January 16, 2026

వంటింటి చిట్కాలు

image

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.

News January 16, 2026

కేంద్ర విద్యుత్ సవరణ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ TG నివేదిక

image

TG: కేంద్ర ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025లోని కొన్ని నిబంధనలను TG వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ERCలకు పూర్తి అధికారాలు, విద్యుత్ సబ్సిడీల హేతుబద్ధీకరణ, పరిశ్రమలు నేరుగా విద్యుత్‌ కొనుగోలు వంటి నిబంధనల్ని కేంద్రం ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రెండు డిస్కంలు నివేదికను సిద్ధం చేశాయి. CM అనుమతితో అధికారులు దీన్ని కేంద్రానికి సమర్పించనున్నారు.