News March 10, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Similar News
News October 17, 2025
రేపటి బంద్లో అందరూ పాల్గొనాలి: భట్టి

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.
News October 17, 2025
స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT 22లోగా ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్కు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందజేస్తారు.
News October 17, 2025
చరిత్రలో తొలిసారి.. అరుణిమకు అరుదైన గౌరవం

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి అరుణిమ కుమార్కు యూకేలో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఆమెను ‘బ్రిటిష్ ఎంపైర్ మెడల్’తో సత్కరించారు. కూచిపూడి నర్తకి ఈ గౌరవం పొందడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది భారతీయ నాట్యానికి దక్కిన గుర్తింపు అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో పుట్టిన అరుణిమ ప్రస్తుతం యూకేలో నివాసం ఉంటున్నారు. తన డాన్స్ అకాడమీ ద్వారా ఇప్పటిదాకా 50+ దేశాల్లో 3వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.