News January 26, 2025
త్వరలోనే అందరికీ సన్నబియ్యం: సీఏం రేవంత్

TG: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదని మండిపడ్డారు. తాము పేదలు ఇళ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)
News February 18, 2025
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(2/2)

✒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులు, గిరిజన అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹3.14 లక్షలు).
✒ కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు 70%(గరిష్ఠంగా ₹3.10 లక్షలు), పది ఎకరాలు పైబడిన వారికి 50 శాతం(గరిష్ఠంగా ₹4లక్షలు).
✒ అన్ని సామాజికవర్గాల్లో 5 ఎకరాల్లోపు తుంపర పరికరాలకు దరఖాస్తు చేసిన వారికి 50%(₹19వేలు), 12.5 ఎకరాల్లోపు వారికి 50 శాతం(₹19వేలు) సబ్సిడీ అందనుంది.
News February 18, 2025
27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

AP: గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న GOVT ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉ.గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.