News July 21, 2024
‘సారీ డాడీ’.. కంటతడి పెట్టిస్తోన్న ఇంటర్ విద్యార్థిని సూసైడ్ నోట్

HYD: ఆర్కేపురం శ్రీచైతన్య కాలేజీలోని ఇంటర్ 2nd ఇయర్ విద్యార్థిని వేణుశ్రీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఫస్టియర్లో 440కి 432 మార్కులు సాధించిన వేణుశ్రీ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. ‘ఐయామ్ సారీ డాడీ. నీ కూతురిగా ఉండే స్థానం కోల్పోయా. హెల్త్ కూడా అస్సలు బాగుండటం లేదు. నా ఫీజు కట్టేందుకు మీకు ప్రాబ్లమ్ అవుతోంది’ అని రాసింది.
Similar News
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను భారత్కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.
News December 4, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 4, 2025
విష్ణుమూర్తిని ఎందుకు కొలవాలి?

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||
అన్నింటినీ నియంత్రించే ఈశానుడు, ప్రాణాన్నిచ్చే ప్రాణదుడు, గొప్పవాడైన జ్యేష్ఠుడు, సకల జీవులకు ప్రభువైన ప్రజాపతి, బంగారు గర్భం కల్గిన హిరణ్యగర్భుడు, భూమిని తనలో ఇముడ్చుకున్న భూగర్భుడు, జ్ఞానానికి అధిపతైన మాధవుడు, మధు అనే రాక్షసుడిని సంహరించిన మధుసూధనుడైన విష్ణుమూర్తిని జ్ఞానం కోసం నమస్కరించాలి.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


