News November 14, 2024
‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా’

HYD బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో <<14606404>>ఆత్మహత్య<<>> చేసుకున్న జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా’ అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.
Similar News
News November 13, 2025
మూడేళ్లు జైల్లో గడిపిన అల్-ఫలాహ్ ఫౌండర్!

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.
News November 13, 2025
లాక్టోజ్ ఇన్టాలరెన్స్ గురించి తెలుసా?

లాక్టోజ్ ఇన్టాలరెన్స్ ఉన్నవారిలో పాలపదార్థాల్లో ఉండే లాక్టోజ్ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వస్తాయి. వీరు రాగులను నానబెట్టి రుబ్బి తీసిన పాలు, రాగిజావ, రాగి మాల్ట్, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్ ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.


