News November 14, 2024

‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా’

image

HYD బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో <<14606404>>ఆత్మహత్య<<>> చేసుకున్న జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా’ అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.

Similar News

News April 19, 2026

చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

image

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.

News April 19, 2026

మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్‌వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

image

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.