News January 8, 2025
దక్షిణ కోస్తా రైల్వే జోన్: సాకారమైన కల
AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్కు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు అత్యధికంగా ఆదాయం అందించే దక్షిణ కోస్తా ఏర్పాటు లైన్ క్లియర్ అయింది. కొత్త రైళ్లు, మార్గాలు, ప్రాజెక్టులు మరింత సుగమం కానున్నాయి. ఆర్ఆర్బీ, రైల్వే ఆస్పత్రి, శిక్షణ, వర్క్షాపులు ఏర్పాటుతో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Similar News
News January 20, 2025
మొబైల్ రీఛార్జ్లపై GOOD NEWS
రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్వర్క్ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
News January 20, 2025
ట్రంప్ వ్యక్తిగత సమాచారం
డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకొని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
News January 20, 2025
లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం
AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.