News December 11, 2024
2035కల్లా అంతరిక్ష కేంద్రం పూర్తి: కేంద్ర మంత్రి
సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 2035 కల్లా పూర్తి చేస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. 2040కల్లా భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపుతామన్నారు. ‘మన అంతరిక్ష కేంద్రాన్ని భారతీయ అంతరిక్ష స్టేషన్గా పిలుస్తాం. వచ్చే ఏడాది చివరినాటికి గగన్యాన్ ద్వారా వ్యోమగామిని రోదసిలోకి పంపిస్తాం. ఇక సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతున కూడా పరిశోధనలు చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News January 22, 2025
డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
News January 22, 2025
INDvsENG టీ20ల్లో మోస్ట్ రన్స్, వికెట్స్ వీరివే
☛ మోస్ట్ రన్స్: విరాట్ కోహ్లీ – 648 (38.11 avg), జోస్ బట్లర్ – 498 (33.20), రోహిత్ శర్మ – 467 (35.92), జాసన్ రాయ్ – 356 (23.73), ఇయాన్ మోర్గాన్ – 347 (26.69)
☛ మోస్ట్ వికెట్స్: జోర్డాన్ (24), చాహల్ (16), హార్దిక్ (14), బుమ్రా (9), భువనేశ్వర్ (9).
News January 22, 2025
‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.