News February 25, 2025

వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్నటి YCP సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగడం, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం సరికాదన్నారు. MLAలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి ఇవాళ అవకాశం ఉన్నా, ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.

Similar News

News December 20, 2025

T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్‌ఇండియా!

image

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్‌ వరుసగా 14 సిరీస్‌లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.

News December 20, 2025

డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

image

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం

News December 20, 2025

భారత్ VS సౌతాఫ్రికా T20 సిరీస్ హైలైట్స్

image

➻ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వరుణ్ చక్రవర్తి(10 వికెట్లు)
➻ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(5వ T20): హార్దిక్ పాండ్య(25 బంతుల్లో 63)
➻ గత 7 సిరీసులు: 3 డ్రాలు, 4 విజయాలతో భారత్ ఆధిపత్యం
➻ 2015 అక్టోబరులో చివరిసారి భారత్‌పై గెలిచిన SA
➻ గత 35 మ్యాచు(టీ20)ల్లో SAపై భారత్ 21 సార్లు గెలుపు