News February 25, 2025

వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్నటి YCP సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగడం, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం సరికాదన్నారు. MLAలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి ఇవాళ అవకాశం ఉన్నా, ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.

Similar News

News February 25, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.

News February 25, 2025

పెళ్లై ఏడేళ్లు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

TG: గజ్వేల్ సమీపంలోని అడవిమజీద్‌‌కు చెందిన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నర్సింహులుతో నాగరత్నకు వివాహమవ్వగా ఏడేళ్లుగా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా గర్భం దాల్చింది. ఆదివారం ఆమెకు గజ్వేల్ ఆసుపత్రిలో ప్రసవం జరగగా ఇద్దరు మగ, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News February 25, 2025

శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

image

శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేడుకకు ముస్తాబైంది. 1500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సన్నాహాలను మంత్రి ఆనం పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఉచిత లడ్డూ పంపిణీ చేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

error: Content is protected !!