News July 5, 2024

అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పర్యటన

image

AP: అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మీడియా హాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. MLA, MLCల క్వార్టర్ల నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తి చేయగలరని సమీక్షలో CRDA అధికారులను ప్రశ్నించారు. అసెంబ్లీ భవనంలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో లైబ్రరీ, కమిటీ ఛైర్మన్ల ఛాంబర్ల ఏర్పాటుపై అయ్యన్న సమాలోచనలు చేశారు.

Similar News

News December 15, 2025

కొంత ఊరట.. అరటి కిలో రూ.17

image

అరటి ధర పుంజుకుని కిలో కనిష్ఠ ధర ₹.10, గరిష్ఠంగా ₹17కు చేరింది. రాయలసీమ అరటిని ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత నెలలో నాణ్యత లేని అరటి కిలో ₹2కు పడిపోయింది. నెల రోజుల పాటు ఎగుమతులు మందగించాయి. ఈ ఏడాది మహారాష్ట్ర, యూపీలలో సాగు పెరగడంతో సీమ అరటికి డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం పులివెందుల మార్కెట్‌లో గరిష్ఠ ధర ₹16-17 పలికింది. ధర మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 15, 2025

కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.

News December 15, 2025

దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

image

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.