News March 18, 2024

భారత్-చైనా సరిహద్దులో జవాన్ల కోసం స్పెషల్ బంకర్స్

image

చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వద్ద గడ్డకట్టే చలిలోనూ మన జవాన్లు గస్తీ కాస్తుంటారు. అందుకే వారి కోసం కేంద్రం పెద్ద ప్రత్యేక బంకర్లను నిర్మిస్తోంది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ బంకర్లు -30 డిగ్రీల్లోనూ 22 డిగ్రీల వెచ్చని వాతావరణం కల్పిస్తాయట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు చోట్ల ఏర్పాటైన ఈ బంకర్లను ఇప్పుడు ప్రభుత్వం ఆధునీకరించి మరిన్ని చోట్లకు విస్తరిస్తోంది.

Similar News

News April 18, 2025

ALERT: నేడు పిడుగులతో వర్షాలు

image

AP: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 83 మండలాల్లో వడగాలులు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.

News April 18, 2025

చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

image

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్‌ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.

News April 18, 2025

రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

image

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!