News November 10, 2024
చలికాలంలో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు

చలికాలం దృష్ట్యా అయోధ్యలోని రామ్ లల్లాను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచాలని ఆలయ నిర్వాహకులు భావించారు. ప్రత్యేక శాలువాలు, ఉన్ని దుస్తులతో ఆయనను అలంకరించాలని నిర్ణయించారు. వీటిని ఢిల్లీకి చెందిన ఓ డిజైనర్ రూపొందిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల ఆయనకు నివేదించే ప్రసాదంలోనూ మార్పులు చేస్తున్నారు. బాలరాముడికి డ్రై ఫ్రూట్స్, పూరీ, హల్వాను నివేదిస్తారు.
Similar News
News November 12, 2025
రబీలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు

నీటి వసతిని బట్టి రబీలో వేరుశనగను నవంబర్ నుంచి DEC-15 వరకు విత్తుకోవచ్చు. కోస్తా జిల్లాల్లో రైతులు ఎక్కువగా విశిష్ట TCGS 1694 రకాన్ని సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 100-105 రోజులు. దిగుబడి హెక్టారుకు 25 క్వింటాళ్లు. దీనిలో నూనెశాతం 49%. ఇదే కాకుండా కదిరి-6, కదిరి-7, ధీరజ్, ధరణి, గ్రీష్మ, నిత్యహరిత మంచి దిగుబడిస్తాయి. వేరుశనగను ప్రతిసారి ఒకే రకం కాకుండా.. మార్చి నాటితే మంచి దిగుబడి పొందవచ్చు.
News November 12, 2025
MSTCలో 37 ఉద్యోగాలు

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://mstcindia.co.in/
News November 12, 2025
CCS సమావేశం ప్రారంభం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీతారామన్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఈ భేటీలో ఉగ్రవాదుల ఏరివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో మేజర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే CCS భేటీ అవుతుంది.


