News June 29, 2024
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: సీఎం చంద్రబాబు
AP: మంగళగిరి TDP ఆఫీసులో ప్రజలు, కార్యకర్తల నుంచి CM చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. కొందరు వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించి ఆయనను సాయం కోరారు. ‘ప్రజల వినతులు చూస్తుంటే ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తుంది. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ఇన్ని సమస్యలు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తా’ అని బాబు వెల్లడించారు.
Similar News
News October 11, 2024
అప్పుడే బంధాలు మెరుగుపడతాయి.. కెనడాకు తేల్చిచెప్పిన భారత్
భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకున్నప్పుడే కెనడాతో బంధాలు మెరుగుపడతాయని భారత్ స్పష్టం చేసింది. భారత్-ఆసియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా PM మోదీని కలిసి వాస్తవిక సమస్యలపై చర్చించినట్టు కెనడా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.
News October 11, 2024
నోయల్ టాటా చరిత్ర ఘనం
1957లో జన్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ దశకంలో టాటా గ్రూప్లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్ను సంస్థ MDగా 700 స్టోర్లకు విస్తరించారు. $500M విలువగల టాటా ఇంటర్నేషనల్ను $3 బిలియన్లకు తీసుకెళ్లారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఆయన రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ ట్రస్టుల విధులను పర్యవేక్షిస్తారు.
News October 11, 2024
ట్రంప్ ఎన్నికల ప్రకటనల్లో తెలుగు కూడా!
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.