News August 3, 2024

SPIRITUAL: శ్రీవైష్ణవ దివ్యక్షేత్ర వైభవం ‘శ్రీరంగం’

image

108 శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో భవ్యమైనది తమిళనాడులోని శ్రీరంగం. విష్ణువు రంగనాథుడిగా ఇక్కడ కొలువున్నారు. శ్రీరామానుజులవారు ఎన్నో ఏళ్లు ఈ స్వామి సేవలో తరించారు. రాములవారు ఇచ్చిన రంగనాథ విగ్రహంతో లంకకు వెళ్తూ విభీషణుడు ఇక్కడ విశ్రాంతికి ఆగారట. బయలుదేరే సమయంలో మూర్తి ఎంతకూ కదలకపోవడంతో ఇక ఇక్కడే ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. ఢిల్లీ సుల్తాన్ కుమార్తె స్వామిపై భక్తితో ఆయనలో ఐక్యమైందని చెబుతారు.

Similar News

News March 10, 2026

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ చీఫ్ జగన్ రేపు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.

News March 10, 2026

12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

image

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

News March 10, 2026

చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

image

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.