News August 2, 2024
SPIRITUAL: 3రంగుల్లో దర్శనమిచ్చే జబల్పూర్ పచ్చమాత

మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నెలకొని ఉంది శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పచ్చమాత ఆలయం. మూలవిరాట్టు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం నీలంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 7 శుక్రవారాలు దర్శించుకుంటే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడున్న ఆలయాన్ని 1100 ఏళ్ల క్రితం గోండ్వానా పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి పాదాలపై సూర్యకిరణాలు పడుతుండటం ఇక్కడి మరో విశేషం.
Similar News
News March 12, 2025
ప్రపంచమంతా ఏకమైనా టీమ్ ఇండియాను ఓడించలేరు: అఫ్రీది

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీమ్ను ఓడించలేరని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులే. భారత్కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
News March 12, 2025
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: కిషన్ రెడ్డి

TG: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ ప్రశ్నిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాయడం నవ్వులాటగా ఉందన్నారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని సూచించారు.
News March 12, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1930: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర ప్రారంభం
* 1962: ఉమ్మడి ఏపీ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
* 1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు, 257 మంది దుర్మరణం
* 2011: YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
* 1968: మారిషస్ స్వాతంత్ర్య దినోత్సవం